బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ శివారులో నిర్మించిన అవంతి ఫ్రొజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ గురువారం మృతి చెందింది.అవంతి ఫ్యాక్టరీలో మహాలక్ష్మి పని చేస్తున్న సమయంలో కంపెనీలో కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు, తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అంటూ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కంపెనీ వద్ద దాదాపు10 గంటలు నిరసన.కొనసాగిన కొనసాగించారు నిరసన అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం,కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు.బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పై ఉందని ఎమ్మెల్యే సత్య ప్రభ గట్టిగా చెప్పడంతో కంపెనీ యాజమాన్యం దిగి వచ్చింది.ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి 13 లక్షల రూపాయల నష్టపరిహారం,మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం, పిల్లలకు చదువుకు నెలకి 6000 ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది ఆని ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మీడియాకు తెలిపారు.బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతో కుటుంబ సభ్యులు,ఏలూరు గ్రామస్తులు, ఇతర కార్మికులు, ఎమ్మెల్యే సత్య ప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..