మానవత” సేవలు అద్వితీయం తుడా ఎస్ఈ ఎన్వీ కృష్ణారెడ్డి రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబుకు సన్మానం

మనన్యూస్:తిరుపతి రాష్ట్రవ్యాప్తంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలు అద్వితీయమని తుడా ఎస్ ఈ ఎన్ వెంకట కృష్ణారెడ్డి కొనియాడారు.ఆదివారం జరిగిన మానవతా నెలవారీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రవ్యాప్తంగా 124 యూనిట్ల ద్వారా 80 వేల మంది సభ్యులతో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని పేర్కొన్నారు. తిరుపతి మానవతా శాఖ ప్రగతికి తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.సంస్థలో సభ్యుల సంఖ్య పెంచి సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు.ఇటీవల శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ కు మానవత సంస్థతోపాటు విరాళం అందించిన రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబును మానవత సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రజలు చేపట్టాల్సిన చర్యలను లైన్స్ క్లబ్ సభ్యులు కోల ముని దామోదరం సోదాహరణంగా వివరించారు.బాడీ ఫ్రీజర్ల రవాణాకు, శాంతి రథంను విరివిగా వినియోగించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి మానవత సభ్యులు పలు సూచనలు చేశారు.ఈసమావేశంలో మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్ వి కృష్ణారెడ్డి,చైర్మన్ భార్గవ,అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి రమణ,సుకుమార్ రాజు,కోశాధికారి భాస్కర్ రెడ్డి,సభ్యులు ఎల్ఐసి పద్మనాభం, రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి,రిటైర్డ్ టీటీడీఏఈ రమణయ్య,భాగ్యలక్ష్మి,సుధాకర్ బాబు,గోపి, ముని దామోదరం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..