

మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో పెంచిన విద్యుత్ బిల్లులు పెంపు తక్షణమే ఉపసంహారంచుకోవాలని డిమాండ్ చేస్తూ వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైయసార్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించి భారీ ర్యాలీతో రామారావు పేట సెక్షన్ 4 విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు.ఈ సందర్భంగా డివిజన్ ఎలక్ట్రీకల్ సూపరింటేండెంట్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు రేట్లు పెంచమని చెప్పి నిత్యావసరాలు,కరెంట్ చార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు.తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో 9 గంటలు నిర్వీరామంగా ఎక్కడా కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం చెజిక్కించుకుని కేవలం తాను, తన మునుస్యులు బాగుకోసం ఎటువంటి కుట్రకైనా సిద్ధం అవుతారని దీనిలో భాగంగా అమరావతి నిర్మాణం పనులు చేపట్టుతున్నారని ఆరోపించారు. భవిష్యత్ పై చంద్రబాబు, ఆయన మనుష్యులు క్లారిటిగా ఉన్నారని ఎటువచ్చిన ప్రజలకే బాబు పాలన పై క్లారిటి లేదని ఏద్దెవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు.నాయకులు పాల్గొన్నారు.
పిఠాపురం నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో పిఠాపురం మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు,గొల్లప్రోలు నగరం పంచాయితి కౌన్సిల్ సభ్యులు,నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొనగా, ర్యాలీ గా వెళ్లి విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
