తిరుప‌తిలో మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాలి..సీ.డాప్ ఛైర్మ‌న్ దీప‌క్ రెడ్డి తో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు..స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని విన‌తి

మన న్యూస్: తిరుపతి,విజ‌న్-2047 సాకారం దిశ‌గా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు స‌హ‌క‌రించాల‌ని సీడాప్ ఛైర్మ‌న్ జి.దీప‌క్‌రెడ్డి ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు కోరారు.విజ‌య‌వాడ‌లోని సీ.డాప్ కార్యాల‌యంలో శుక్రవారం సీ.డాప్ ఛైర్మ‌న్‌ను శాప్ ఛైర్మ‌న్ శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ, ఉపాధి క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వారిరువురూ చ‌ర్చించారు. తొలుత శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు మాట్లాడుతూ తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో సుమారు 2ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ, పీజీ,ఇంజినీరింగ్‌లు పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్నార‌న్నారు.తిరుప‌తికి మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు,ఇండ‌స్ట్రీల‌ను తీసుకొచ్చి మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాల‌ని, నిరుద్యోగులంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన్న‌వించారు. దీనికార‌ణంగా తిరుప‌తిలో నిరుద్యోగుల సంఖ్య త‌గ్గుతుంద‌ని,యువ‌త‌కు ఉపాధి క‌ల్పించిన‌వార‌మ‌వుతామ‌ని వివ‌రించారు. అలాగే తిరుప‌తి జిల్లాలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేసి యువ‌త‌కు ఉపాధి శిక్ష‌ణ నైపుణ్యాల‌ను పెంచేందుకు కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.దీనికి సంబంధించి ఇప్ప‌టికే శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో 50ఎక‌రాల‌కుపైగా భూమిని గుర్తించామ‌న్నారు.సీడాప్ కూడా దీనిపై దృష్టి సారించి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ప‌నులను త్వ‌రగా ప్రారంభించాల‌ని ఆకాంక్షించారు.దీనిపై సీడాప్ ఛైర్మ‌న్ కూడా సానుకూలంగా స్పందిస్తూ యువ‌త భ‌విత‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని, త‌ప్ప‌నిస‌రిగా తిరుప‌తి పార్ల‌మెంటులో మెగా జాబ్‌మేళా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బ‌దులిచ్చారు.ఈ కార్య‌క్ర‌మానికి ముందు సీడాప్ ఛైర్మ‌న్ దీప‌క్‌రెడ్డి కి శాప్ ఛైర్మ‌న్ శాలువా క‌ప్పి స‌త్క‌రించారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//