స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం, దుప్పట్లు పంపిణీ.

మన న్యూస్:నెల్లూరు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, రైల్వే సౌత్ సెంట్రల్ బోర్డు మెంబర్ స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 32వ డివిజన్ వెంగళరావు నగర్ పార్కు సమీపంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణా వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు.లోక రక్షకుడైన ఏసుప్రభువు శాంతి, కరుణ, ప్రేమ, సమాధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణా వెంకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు చూపించిన మంచి మార్గంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. సుమారు వెయ్యి మందికిపైగా అన్నదానం, వస్త్ర దానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహులు గౌడ్, స్వర్ణా ప్రసాద్, కార్యా నవీన్, దార్ల రమేష్, పాశం శ్రీనివాస్, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు, మురళీకృష్ణరాజు, బెల్లంకొండ వెంకయ్య, అల్లాబక్షు, ముత్తంగి రామయ్య, లాలం పెంచలయ్య, మాలమహానాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు బల్లి వెంకయ్య, జాన్ పీటర్, కట్టేటి మోహన్ కృష్ణ, 32, 33వ డివిజన్స్ ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.