భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి ఎంపీగా చరిత్ర సృష్టించగా తాజాగా ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు. పిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణించి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సేవల ను గుర్తించిన భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ నిర్వాహకులు భారత్ గౌరవ్ అవార్డును అందజేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేతుల మీదుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 5 మంది ఎంపీలకు ఈ అవార్డును ప్రధానం చేయగా అందులో కాకినాడ ఎంపీ కి స్థానం దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ గౌరవ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న తనను గుర్తించి రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కూటమి నాయకులు,కార్యకర్తలు ఘనంగా అభినందించారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి