అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళాలి అధికార సిబ్బంది కి ఎంపీపీ ప్రమీల హితవు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే పాత్రో అధ్యక్షతన సచివాలయం,పంచాయితీసిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రమీల మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి రూపొందించిన 9 ప్రధాన సూత్రాలను ఆమె వారికి తెలియజేశారు.1.పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కలిగిన గ్రామం కావాలన్నారు. 2. ఆరోగ్యవంతమైన గ్రామము కావాలని కోరారు.3.బాలహిత గ్రామము,4.నీరు సమృద్ధిగా కలిగిన గ్రామము,5. పరిశుభ్రతతో పాటు పచ్చదనం కలిగిన గ్రామము,6. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామము.7. సామాజికంగా సుస్థిరమైన గ్రామము. 8.సుపరిపాలన కలిగిన గ్రామం, 9. మహిళా హిత గ్రామము కావాలని కోరారు. పై 9 లక్ష్యాలు ఆయా పంచాయతీల్లో కలిగిన అన్ని శాఖలతో సమన్వయంతో పరిపూర్ణంగా అమలుపరిచినట్లయితే పూర్తిస్థాయిలో ఆయా పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.అలాగే 2025-26 సంవత్సరాలుగాను ఆయా పంచాయతీల్లో ప్రణాళికలు తయారు చేసేవిధoగా రూపొందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా సమన్వయంతో గ్రామపంచాయతీలు అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని మీరంతా సహకరించాలని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరారు. జిల్లా అధికారుల ఆదేశానుసారం మనమంతా చక్కగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వారితోపాటు పంచాయతీ విస్తరణ అధికారి మల్లేశ్వరరావు, పలువురు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం