ఆటోనగర్ లో భూ కబ్జాపై చర్యలు తీసుకోండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్17ఆటో నగర్ లో మంగళవారం ఉదయం రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఇంటి స్థలాల కోసం 62 వినతిపత్రాలు రాగా 76 అర్జీలు వివిధ రకాల రెవెన్యూ సమస్యలపై వచ్చాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు తహశీల్దారు బాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఆటోనగర్ లో సత్యసాయి ట్రస్టు కి ఇచ్చిన స్థలాన్ని వైసిపి కార్పొరేటర్ భర్త అజయ్ కుమార్,నాగేశ్వర రావు లు ఆక్రమించారని ఎన్డీఎ నాయకులు చల్లా, బాబ్జీ, పెంచలయ్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎన్డీఎ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.ప్రజలు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆటోనగర్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఎలా మేలు చేయాలన్న విషయమై నివేదిక ఇవ్వాలని తహశీల్దారు భాగ్యలక్ష్మి ని ఆయన ఆదేశించారు. సత్యసాయి ట్రస్టు భూమి ఆక్రమణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్,క్లస్టర్ ఇంచార్జీ కృష్ణ యాదవ్,రామా యాదవ్, పెంచలయ్య, కమల్ నాయుడు,నాని,జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి,శంకర్ గణేష్,భరత్,దివాకర్,సుజిత్, దినేష్,సరితా నాగరాజు,శివ కుమార్, నాగరాజు,కెంఎంకె లోకేష్,వూస మాధవ రావు,ఆముదాల వెంకటేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///