కొటికిపెంట నిర్వాసితులకు వసతి కలిపించాలి పార్వతీపురం గ్రీవెన్స్ లో సర్పంచ్ నాయుడు

మన న్యూస్:పాచిపెంట,డిసెంబర్ 16పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 19 సంవత్సరాల క్రితం పెద్ద గెడ్డ జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మా పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోటికి పెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పార్వతిపురం గ్రీవెన్స్లలో అధికారులను కోరారు. సోమవారం నాడు ఆయన కొంతమంది నిర్వాసితులతో కలిసి వారి సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు మెమోరాండం అందించారు.2005 సంవత్సరంలో జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయామని దాని నిమిత్తం మాకు వేరే దగ్గర 18ఎకరాలు స్థలము ఇల్లులు నిర్మాణం కోసం చూపించారని,కానీ ఇంతవరకు వాటిలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆయన అధికారులకు తెలియజేశారు.19 ఏళ్ల క్రితం నుంచి తాము నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు మారినా మా సమస్యలు తీరలేదని మా సమస్యలు తీరాలంటే మీరు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.ఇల్లులు నిర్మించే స్థలం వద్ద వెంటనే మంచినీటి సౌకర్యము, పాఠశాల భవన నిర్మాణము, రహదారులు నిర్మాణం చేపట్టాలని కోరారు.గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం తో పలువురు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విచారణ జరిపించి పరిష్కార మార్గం చూపాలని ఆయన జిల్లాజాయింట్ కలెక్టర్,మిగతా అధికారులను కోరారు.వీరి దరఖాస్తు పై జాయింట్ కలెక్టర్ స్పందించి సమంత అధికారులతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.నిర్వాసిత స్థలంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ గ్రామంలో కలుసిత నీరు త్రాగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.వారి బాధను వ్యక్తం చేశారు.ఈ సమస్య కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..