అంతా తానై మానవత్వం చాటిన రవీందర్ రెడ్డి గురుకుల విద్యార్థి అమూల్యకు వైద్య సహకారం వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన మంత్రి సీతక్క, తనయుడు ధనసరి సూర్య.

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి గుమాసు అమూల్య ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైంది. పాల్వంచ లోని నవభార గురుకుల విద్యాలయంలో అమూల్య 9వ తరగతి చదువుతుంది. వాలీబాల్ ప్లేయర్ అయిన ఈమె ఇటీవలే జరిగిన సీఎం కప్ ఆటల పోటీల్లో పాల్గొంది. అమూల్య జట్టు మండల స్థాయి వాలీబాల్ పోటిల్లో విజయం సాధించి ఖమ్మం జిల్లా వైరాలొ జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంది. అనంతరం తిరిగి తమ గురుకుల పాఠశాలకు వచ్చాక తీవ్ర జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురైంది. మూడు రోజుల క్రితం గురుకుల బాధ్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్లేట్లెట్స్ బాగా పడిపోయి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటంతో మూడు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆర్థిక దుస్థితిలో ఉన్న అమూల్య కుటుంబానికి ఈ ఆసుపత్రిలో కూడా రూ. 45 వేల వరకు వైద్య ఖర్చులు కాగా మొత్తం కట్టారు. కాగా భద్రాచలం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు సూచన చేస్తూ అమూల్యను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరిలించాలని చెప్పారు. దింతో చేసేది లేక బిడ్డను బతికించుకోవడం కోసం ఆదివారం తెల్లవారుజామున నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే నిమ్స్ లొ వైద్యం కోసం బెడ్స్ ఖాళీ లేవని ఆసుపత్రి బాధ్యులు తిరస్కరించారు. దీంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. బిడ్డను కాపాడుకునే తపన… ఆందోళనలొ సమీపంలో వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలొ చేర్పించారు. ఆ ఆసుపత్రిలో అమూల్యను ఐ సి యు లొ ఉంచి వైద్యం ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రానికే రూ. 50 వేల వరకు బిల్లు వేశారు. ఈ పరిణామంతో అమూల్య తండ్రి సన్నకారు రైతు అయిన వెంకటేశ్వర్లు వెంట తీసుకెళ్లిన డబ్బులు మొత్తం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో ప్రవేట్ ఆసుపత్రుల్లో మానవత్వం, మనిషి పట్ల కనికరం మచ్చుకైనా కనిపించడం లేదు. చేతుల్లో చిల్లి గవ్వ లేక తండ్రి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లొ ఒక్కరోజు గడవకముందే నానా అవస్థలు ఎదుర్కొన్నారు. బీదవాళ్లకు పెద్ద జబ్బులు వస్తే ఇక మరణమే శరణ్యంగా భావించారు. చేతుల్లో డబ్బులు లేక ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో గంట గంటకు మందులు, వివిధ పరీక్షల పేర బిల్లులు కట్టలేక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ దశలో మంత్రి సీతక్క, ఈమె తనయుడు ధనసరి సూర్య దృష్టికి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క, సూర్య నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుని సహకరించారు. దీంతో అమూల్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆమె ను శనివారం రాత్రికి రాత్రి నిమ్స్ కు తరిలించారు. మంత్రి కలగజేసుకుంటే గాని నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ , వైద్యం అందలేదు. నిమ్స్ కు తరలించే విషయంలో రవీందర్ రెడ్డి కూడా చాలా సహకరించారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స కోసం రవీందర్ రెడ్డి కృషి చేసి బాధిత కుటుంబానికి తానున్నానని ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. స్వయంగా అమూల్య దగ్గరికి వెళ్లి పరామర్శించి, చికిత్స ఎలా అందిస్తున్నారో వైద్యులతో మాట్లాడి తెలుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వున్న వెంకటేశ్వర్లు కుటుంబానికి రవీందర్ రెడ్డి అందించిన భరోసా, సహకారంతో ఆ కుటుంబానికి ఓదార్పు లభించింది.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి