రెవిన్యూ సదస్సు లో గిరిజన సర్పంచ్లు మొర

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీలో తాము సాగు చేస్తున్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య తదితరులు రెవెన్యూ సదస్సులో కోరారు. శుక్రవారం నాడు పూడి గ్రామం వద్ద పాచిపెంట మండల తాసిల్దార్ డి రవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో ఏజెన్సీ సమస్యలపై ఐదు పంచాయతీలు సర్పంచులు సమస్యలతో కూడుకున్న మెమోరండం అందించారు. వారి సమస్యలు ఇలా వున్నాయి. కొండమోసూరు పంచాయతీలో 1600 ఎకరాలు సర్వే జరపాలని కోరారు.అలాగే కేరంగి రెవెన్యూ పరిధిలో 800 ఎకరాలు సర్వే జరపాలని కోరారు.అలాగే మిలియా కంచూరు, తుమరావల్లి పంచాయతీ పరిది గిరిజన గ్రామాల్లో 2000 ఎకరాలు సర్వే జరపాలని కోరారు. అలాగే అటవీ భూములు సాగు చేస్తున్నాము వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో రహదారులు నిర్మించాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు కోసం చాలా మంది దరఖాస్తులు చేసారు. వారు అందించిన వినతి పత్రం క్షుణ్ణంగా చదివిన తాసిల్దారు రవి మీ సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదిక తయారు చేసి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అర్హులు కు రేషన్ కార్డులు వచ్చే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. సర్పంచ్ సోములు లచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందలేదని మా సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వడం లేదని మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని తమరు వెంటనే స్పందించి మాకు పట్టాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా