అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 7:అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ.50 వేలు చెక్కు ఇచ్చానని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పై చేసిన అనవసర ఆరోపణలకు ఎంపీ వేమిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కనుపర్తిపాడులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారని, తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో తెలియదా అని ప్రశ్నించారు. శ్రీ కాకుళంకు చెందిన అప్పన్న అనే వ్యక్తి పేదవాడు, జరుగుబాటు లేదు అని నాడు వైవీ సుబ్బారెడ్డి దగ్గర చేరితే, సుబ్బారెడ్డి తాను సహాయం చేయలేను అని నన్ను అడిగితే… ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశానో.. ఆ రోజు కూడా అలాగే చేశానని కుండబద్దలు కొట్టారు. తాను మాట్లాడే విషయాలు సత్యమా, కాదా అనేది దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి జరుగుబాటు లేదని అంటే.. ఇప్పటికీ కూడా చాలామందికి సహాయం చేస్తున్నానని, తాను నెలలో సహాయం చేసేవాళ్ల లిస్ట్‌ తీస్తే చాలామంది ఉంటారన్నారు. ఈ విషయాలు వారికి కూడా తెలుసని, ఎవరు చెబితే ఇచ్చానో వారి దృష్టిలో ఉందన్నారు. అసలు తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఖండించారు. సేవాభావంతోనే తాను సహాయం చేస్తుంటానని, సేవ చేయడం కూడా తప్పవుతోందని అన్నారు. బండలు మోయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత చేశామో, ఎవరికి చేశామో, మనం చేసే మంచేంటో దేవుడికే తెలుసని, జగన్‌ మోహన్‌రెడ్డి మాటలు బాధేశాయి కాబట్టే ఇప్పుడు చెబుతున్నానన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు