రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల 100% విజయానికి కృషి చేయండి: ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిజియ్యమ్మవలస మండల స్థాయి టిడిపి సమావేశంలో దిశానిర్దేశం

జియ్యమ్మవలస/గుమ్మలక్ష్మీపురం/మనధ్యాస డిసెంబర్6 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జియ్యమ్మవలస మండలంలోని అన్ని పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు.
శనివారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జియ్యమ్మవలస మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు జోగి భుజంగరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి, పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం పార్టీ బాధ్యతగా పేర్కొన్నారు.
మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులనే గెలిపించే విధంగా కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.పార్టీ అభివృద్ధి, ప్రజలతో పరిచయం, గ్రామ స్థాయి ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యే జగదీశ్వరి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య నిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు. అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.డొంకాడ రామకృష్ణ. ప్రెసిడెంట్ జి రామకృష్ణ. మజ్జి చంద్రమౌళి. బి ప్రకాష్ రావు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం