డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయండి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బంగారుగూడెం గ్రామస్తులు

మన న్యూస్: పినపాక, దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుచేసింది. అసంపూర్తి నిర్మాణాలతో పేద ప్రజలను అయోమయానికి గురిచేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆశించిన ప్రజలు అర్ధాశలతో పూర్తి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
కరకగూడెం మండలం, కన్నాయిగూడెం గ్రామపంచాయతి, బంగారుగూడెం గ్రామంలో 2022లో 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. కాంట్రాక్టు పొందిన సదరు కాంట్రాక్టర్ సగం వరకు పూర్తి చేసి చేతులు దులిపేసుకున్నాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ఇసుక, ఇటుక, ఐరన్, సిమెంట్ వంటి వాటిని ఇటీవల కాంట్రాక్టర్ వేరే చోటికి తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు బంగారుగూడెం గ్రామస్తులందరూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి పేదల కళలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు. బంగారుగూడెం గ్రామస్తులు శిధిలమైన ఇళ్ళల్లో నివసిస్తూ భయం భయంగా జీవిస్తున్నారని తెలిపారు .కొన్ని ఇండ్లు నేలమట్టమయి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బంగారుగూడెం గ్రామాన్ని సందర్శించి తప్పకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు .ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడెం నాగేశ్వరరావు, కోడెం రామారావు ,పూనెం విష్ణుమూర్తి ,బంగారు రామయ్య , కోడెం సత్యవతి, కోడెం గంగ,గొగ్గెలి మాణిక్యం, గొగ్గెలి రాధ ,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా