మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తోణాంలో సంతకాల సేకరణ

మన ద్యాస, సాలూరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యటం అన్యాయమని, దీన్ని యావత్తు రాష్ట్రం వ్యతిరేకిస్తోందని కావున ఈ పీపీపీ విధానానికి స్వస్తి చెప్పాలని తోణాం సర్పంచ్ మువ్వల ఆదయ్య డిమాండ్ చేసారు. ఆదివారం ఉదయం మండలంలోని తోణాం పంచాయితీ మథుర గ్రామం మెట్టవలసలో వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని కూటమి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం సర్పంచ్ తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వంలోని కొంత మంది ప్రజా ప్రతినిధుల బంధువులకు అప్పగించేందుకు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారన్నారు. అంతేకాకుండా వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి మందితో సంతకాలు చేయించి గవర్నర్ కి ఇచ్చేందుకు తమ పార్టీ నాయకులు నిర్ణయించారన్నారు. అందులో భాగంగా తాము సేకరించిన సంతకాలను తమ పార్టీ నేత, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా సమితి సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ద్వారా గవర్నర్ కి అందజేస్తామన్నాను

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం