రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు.సకాలంలో బిల్లులు వస్తున్నాయా లేదా ఇంటి నిర్మాణం ఖర్చులు ఇసుక లభ్యత ఇతరత్ర విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది నిర్మించుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి,వెల్గనూర్ గ్రామలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు.రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలు డబ్బులు జమ చేయబడుతున్నాయని తెలిపారు. ట్యాబు ఎంట్రీ 100% చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాలల్లో మౌలిక వసతులు కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అలాట్మెంట్ చేసిన రైస్ మిల్ కు మాత్రమే లారీలను పంపాలని తగిన సూచనలు చేశారు.జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 195 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు,సొసైటీలో 234 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్,డిసిఓ రామ్మోహన్ రావు,డిసిఎస్ ఓ వెంకటేశ్వర్లు,ఎపిడీ వామన్ రావు,తహసిల్దార్ బిక్షపతి,ఎంపీడీవో శివకృష్ణ, ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఏఈఓ స్వర్ణలత, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి,సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి గంగసాగర్,నాయకులు బ్రహ్మం,అనీస్ పటేల్,మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం