ఇందిరా నగర్ గ్రామానికి వెళ్లే దారిని కమ్మేసిన కంపచెట్లు,, సర్పంచ్ రోడ్డ వెంగమ్మ ఆధ్వర్యంలో కంప చెట్లు తొలగింపు,,,,

వింజమూరు నవంబర్ 14 : మన ధ్యాస న్యూస్:

వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో కంపచెట్లో వేపుగా పెరిగి దారిని కమ్మేయడంతో ఊటుకూరు సర్పంచ్ రోడ్డా వెంగమ్మ ఆధ్వర్యంలో జెసిబి ని ఏర్పాటు చేసి కంపచెట్లను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఉండడం వలన రాత్రివేళలో పాములు తిరుగుతూ ఉంటాయని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా తక్షణ చర్యల్లో భాగంగా ఈరోజు మాజీ ఎంపీటీసీ సభ్యులు రోడ్డా కొండయ్య దగ్గరుండి చెట్లను తొలగించారు. గ్రామపంచాయతీలో ఏ సమస్యలు నెలకొన్న తక్షణమే పరిష్కార దిశగా అడుగులు వేస్తూ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న సర్పంచ్ గారికి పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం పై దృష్టి పెడుతూ ఒక మంచి మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దే దిశగా నిరంతరం పనిచేస్తూ ఉండడం సంతోషకరం అని గ్రామస్తులు తెలిపారు.నిత్యం ప్రజా సమస్యల పై దృష్టి పెడుతూ గ్రామభివృద్ధికి తొడ్పాటునివ్వడంతో గ్రామస్తులు హర్షతేరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాల దాటికి జువ్విగుంటపాలెం దగ్గర లోతట్టు ప్రాంతంలో నీరు నిలబడి, దారి లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో పంచాయతీ కార్యదర్శి పెంచలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండయ్య చొరవతో గ్రావెల్ తోలి చదను చేయడం జరిగింది. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్న తక్షణమే స్పందిస్తూ గ్రామ స్వచ్ఛతకు శ్రీకారం చూడుతున్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం