కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరం జరుగుతుందని టూరిజంశాఖ మంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గల ప్రసిద్ధిగాంచిన,పురాతనమైన కౌలాస్ కోటను ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి పరిశీలించారు.వందలాది నిచ్చేనాలు ఎక్కుతూ, బండరాళ్లు,చెట్ల పొదల మధ్యల నుండి ముందుకు సాగుతూ కోట ఖండాలను,పురాతన శిల్పాలు,గత వైభవలను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. కోట బురుజు పై ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద 9గజాల ఫిరంగి పరిశీలించటం జరిగింది. గతంలో దాని ఉపయోగించిన తిరును కౌలాస్ కోట వంశీయులు అనూప్ కుమార్ మంత్రికి వివరించారు. ప్రాచీన కళాఖండాలు,ప్రాచీన కట్టడాలు ప్రాచీన వైభవాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,తెలంగాణ ప్రభుత్వం దానికి ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి కౌలస్ కోటను పర్యాటక స్థలంగా తీర్చదిద్దటం జరుగుతుందని,కోట ముందు ఉన్న కౌలాస్ నాల పై వంతెన నిర్మించి కౌలాస్ నాల ప్రాజెక్టును కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,డీఎఫ్ఓ నిఖిత,ఆయా శాఖల ఉన్నతాధికారులు,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,కౌలాస్ గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా