బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో అక్రమ గ్రావెల్ రవాణా నిలిపివేత

పర్యావరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా కార్యకలాపాలు – మైన్స్ శాఖ రూ.4 లక్షల జరిమానా

పాలసముద్రం మన ధ్యాస : గంగాధర నెల్లూరు నియోజకవర్గం బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాపై కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు మైన్స్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి రవాణాను నిలిపివేశారు.పర్యావరణ శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలింపులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వద్ద ఇప్పటికే కేసు నమోదు చేయబడినట్టు అధికారులు తెలిపారు.దర్యాప్తులో సుమారు 1098మెట్రిక్ టన్నుల అక్రమ గ్రావెల్ ఉన్నట్లు గుర్తించిన మైన్స్ శాఖ, సంబంధిత కాంట్రాక్టర్లపై రూ.4 లక్షల జరిమానా విధించి, ఖనిజ కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది.అధికారుల హెచ్చరిక ప్రకారం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే వారు ఎవరైనా అయినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఖనిజ వనరుల సంరక్షణ కోసం ఇలాంటి అక్రమ రవాణా చర్యలు తక్షణమే అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం