సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల

‎తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను పురస్కరించుకుని తవణంపల్లి మండలం కృష్ణాపురంలో గురువారం మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన బ్రాంచ్ సమావేశంలో సురేంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో పేదలపై దాడులు, ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్యాలు, మహిళలపై హింసలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మతతత్వం, మనువాదం పేరుతో ప్రజలను విభజిస్తూ, హిందుత్వ ముసుగులో ఆర్ఎస్ఎస్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్యమానికి ఈ మహాసభలు వేదికవుతాయని వివరించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి, సంక్షేమం కనబడడం లేదని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర సంపదను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలను కార్పొరేట్ ప్రయోజనాలకే వాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు వంటి ప్రజా ఆస్తుల విషయంలో నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారని సురేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. మత్స్యకారులపై కాల్పులు జరిపి, ఆదానీ కంపెనీకి పోర్టును అప్పగించడం ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. జిల్లా కమిటీ సభ్యురాలు సుగుణ మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు పెరిగి పోతున్నాయని, ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో విఫలమయ్యాయని అన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా కూడా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం అయితేనే న్యాయం సాధ్యమవుతుందని, ఎర్ర జెండా అండగా ప్రజా పోరాటం కొనసాగుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, శ్యామల, సురేష్, రాణి, అమర, మొగలేశ్వరి తదితర పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?