తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి రిజర్వేషన్ల పోరాటానికి ఏకం కావాలి

బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్, డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ హాజరై బిసి రిజర్వేషన్ల పోరాటం రాష్ట్రంలో రోజు రోజుకు ఉదృతం అవుతున్న సందర్భంగా బిసిలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బిసి రిజర్వేషన్ల పోరాటం ఉగ్రరూపం దాలుస్తుందని ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వనుకు పుట్టే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సకలజనుల సమ్మె తరహాలో బిసి జెఏసి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల జెండాలు పక్కన పెట్టి బిసి జెఏసి ఆధ్వర్యంలో బిసి జెండాలు పట్టుకుని రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైనదని అన్నారు. వరంగల్ గడ్డ అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని అందులో నర్సంపేటకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తుచేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా బిసి లు కులాలకు అతీతంగా మేల్కోని 42 శాతం రిజర్వేషన్ల పోరాటంలో ఇప్పటికైనా బిసి లు రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి కులాలకు అతీతంగా అందరూ ఏకమై బిసి జెండాలు పట్టుకుని ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, బీసీ కార్మిక సంఘం నాయకులు బండి వెంకటేశ్వర్లు, చెన్నారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు బండి విజయ, నర్సంపేట పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, శీరంశెట్టి రాజేందర్ లు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?