పీ.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్)

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్‌లో పి.ఇ.టి. మాస్టర్‌గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల మరణం చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వాల్ల స్వగృహానికి వెళ్లి మన్నెం నరసారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మన్నెం నరసారెడ్డి సమాజ సేవా భావంతో, క్రమశిక్షణతో జీవించిన వ్యక్తి అని, ఉపాధ్యాయ వృత్తి ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప గురువుగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తన వృత్తి జీవితంలో విద్యార్థుల అభివృద్ధి కోసం, పాఠశాల పురోగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా, విద్యావేత్తల వర్గానికి తీరని లోటు అని ఎమ్మెల్యే సురేష్ అన్నారు.మన్నెం నరసారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనసారా ప్రార్థించారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్