అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీలకే ప్రజానీకం మొగ్గు సంతకాల సేకరణ విజయవంతం మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాల్సిందే సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీమ్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి మున్సిపాలిటీని విలీనం చేసిగ్రామ పంచాయతీల ఏర్పాటుకు మద్దతు పలికారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.అనంతరం రవి మాట్లాడుతూ.. గత పాలకుల అనాలోచిత విధా
నాల వల్ల అన్నారం, చిన్నరాయి గూడెం, కమలాపురం వంటి అనేక గ్రామాలనుమున్సిపాలిటీలో విలీనం చేశారని, నాటి పాలకులు తమ స్వాలభ కోసం మున్సిపాలి
టీకి అనేక కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను కలిపి మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారని, ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీల్లో గిరిజన గ్రామాలలను విలీనం చేయడంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. మున్సిపాలిటీల ఏర్పాటుతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడి పన్నులు పెరుగాయని, పేదల బతుకులు దుర్భరంగా మారయన్నారు. ఉపాధి హామీ పథకం అనేకఅభివృద్ధిఫలాలుపేదలకుదక్కకుండాచేశారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపాలిటీల్లో గ్రామాలను ఎలా కలిపారని ప్రశ్నించారు. ఇప్పటికే మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించాలని, చారిత్రక చరిత్ర కలిగిన మణుగూరు ను ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలన్నారు.లేనిచో భవిష్యత్తులో తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. సంతకాల సేకరణ, ప్రజా అభిప్రాయ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతును ప్రకటించిన
వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, వివిధ కుల సంఘాల, మహిళా, ఆదివాసి, ప్రజాసం
ఘాల నాయకులకు, పట్టణ ప్రము
ఖులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు…

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా