ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు వెలుగోటి మధు..!!!

వింజమూరు, అక్టోబర్ 19 :మన ధ్యాస న్యూస్)://

దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఏపీ ఎన్జీవోస్ వింజమూరు తాలూకా (కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలు) అధ్యక్షులు వెలుగోటి మధు హర్షం వ్యక్తం చేశారు.దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం, ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వకమైన, గౌరవప్రదమైన, హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం — సంతోషదాయకమని వారు పేర్కొన్నారు.చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన మహిళా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు.హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹50,000 నుండి ₹1,00,000కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹2 లక్షల నుండి ₹5 లక్షల పైబడేలా పెంచడం, అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడం — ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించే నిర్ణయాలుగా పేర్కొన్నారు.ఉద్యోగ సంఘాలు, ఎన్‌జీవో హోమ్‌లను గతంలో మాదిరిగానే ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయించడం, అలాగే చెల్లించవలసిన బకాయిలను రద్దు చేయడం కూడా హర్షణీయమని తెలిపారు.దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించగలిగిన ఏపీ జేఏసీ స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ కి ఉద్యోగ సంఘాల తరఫున అభినందనలు గవర్నమెంట్ ఉద్యోగుల తరుపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.పిఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ, 57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ (OPS) పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడాన్ని కూడా జేఏసీ హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం మా Apngo స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి, వైజాగ్ శాఖ మంత్రి సత్య కుమార్ కి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి, చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ కి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ ఎన్జీవోస్ మరియు ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని వింజమూరు తాలూకా apngo అధ్యక్షులు వెలుగోటి మధు తెలిపారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్