సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ఎమ్మెల్యే కు టియుసిఐ వినతి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి. జానయ్య, పి. సంజీవరెడ్డి లు మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తూ, యూనియన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని, యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేతనాల పెంపుదలకు కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని అన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని లాభాల వాటా 5000 రూపాయలు చెల్లించడం హర్షించదగ్గ విషయమే అని అన్నారు. అదేవిధంగా వేతనాల పెంపుదల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వేతనాలు పెంచాలని కోరారు. ఈనెల తొమ్మిది నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాల గురించి చర్చ జరిగే విధంగా స్థానిక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు కృషి చేయాలని కోరారు. సింగరేణిలో ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లలో కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. అమలు అయ్యే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వము, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో బలమైన కార్మిక పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని కాంట్రాక్ట్ కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా