నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిగారు ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనీ, చిన్న వయసులోని ఉద్యోగాలు సాధించారు కాబట్టి వృత్తిలో ఆధునికతను జోడించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా విద్యాశాఖను ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు దే న్నన్నారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అత్యధిక డీఎస్సీల ద్వారా రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనీ, ఆయన విజన్ ఉన్న నాయకుడనీ ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి శాఖను బలోపేతం చేస్తున్నారని ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, జిల్లా ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం,ఉపాధ్యాయులు మసనం మాలిరావు, నక్కా శ్రీనివాసులు, పామర్తి ప్రదీప్, గుంటూరు సౌజన్య,షేక్ సుల్తాన్ బాబు, సదానంద్, డోలా హరిబాబు, ఆలా రామకృష్ణ,కరేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!