

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు లో వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ ఎక్సపెర్ట్ గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన ప్రసంగిస్తూ కంప్యూటర్ పరిజ్ఞానం నేటి సమాజంలో ఎంతో అవసరమని ,ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ,ఉద్యోగాల కల్పనలో కంప్యూటర్ కోర్సు ల పరిజ్ఞానం తప్పనిసరి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కరింబేడు పురుషోత్తం ఫౌండర్ అండ్ ట్రైనర్ ఆఫ్ టెక్ లెర్న్ టెక్నాలజీస్ ,తిరుపతి వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ అనే అంశం మీద గెస్ట్ లెక్చర్ ఇచ్చారు.ఈ గెస్ట్ లెక్చర్ లో కె పురుషోత్తం వెబ్ టెక్నాలజీస్ లో వాడే వివిధ టెక్నాలజీస్,సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో అవకాశాలు మీద అవగాహన కల్పించారు ,విద్యార్థుల ప్రశ్నలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ కోర్సు విభాగ అధిపతులు వై. శ్రీనివాసులు, ఎస్ కె . మున్వర్ ,కంప్యూటర్ టెక్నాలజీ మరియు కోర్సుల్లో వస్తున్న మార్పులు వివరించారు.ఈ కార్యక్రమంలో ఐక్యుఎసి కోర్డినేటర్ డాక్టర్ పూడి వెంకటేష్, ఫిజికల్ డైరెక్టర్ భరణీనాథ్ రెడ్డి , అధ్యాపకులు టి.నరేంద్ర బాబు , ఎమ్.ఇస్మాయిల్ మరియు విద్యార్థినీ విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.