యర్రవరంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్న కూటమి శ్రేణులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఈనెల 17వ తేదీన ప్రారంభమైన పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా యర్రవరం సచివాలయం 2లో సుపోసిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ పద్మావతి, స్థానిక కూటమి నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు.గర్భవతులు,బాలింతలు తీసుకోవలసిన ఆహారాలపై అవగాహన కల్పించారు.స్థూలకాయ నివారణ,శిశు చిన్న పిల్లల ఆహారపు అలవాట్లు,బాల్య దశ సంరక్షణ,పిల్లల పట్ల పురుషుల భాగ స్వామ్యం,సమన్వయ చర్యలు,సమగ్ర పోషణకు బలమైన అడుగు అనే విషయాలపై అవగాహన కల్పించారు.కిషోర్ బాలికలకు ఆరోగ్య పరీక్షలు,అంగన్వాడీ చిన్నారులతో యోగా కార్యక్రమాలు,చిన్నారులకు అపార్ ఆధార్,అభా కార్డ్స్ వంటి పలు అంశాలను నిర్వహించారు.అనంతరం అంగన్వాడీ విద్యార్థులు తల్లులకు క్విజ్ పోటీ చేపట్టారు.తండ్రులకు ఆడబిడ్డలతో బైక్ పోటీలు నిర్వహించారు.అనంతరం రుచికరమైన వంటలు చేసిన పలువురు తల్లులకు బహుమతులు అందజేశారు.అలాగే అంగన్వాడీ చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమం నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు చేతుల మీదుగా జరిపించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చక్రవేణి,పంచాయతీ కార్యదర్శి వర్మ, అంగన్వాడీ టీచర్లు ఎస్ఎల్ వి నాగమణి,పి అనంత,ఎస్ అమ్మాజీ,పి చంద్రావతి,కె బుజ్జమ్మ, కె కరుణ జ్యోతి,హెల్పర్లుఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!