సహజ సిద్ధంగా అడాలి వ్యూ పాయింట్,జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి,

మన ధ్యాస పార్వతీపురం, సెప్టెంబర్ 23:- అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటని, జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు. అయితే ప్రకృతి సిద్ధంగా ఉండి, ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్ లో కాంక్రీటుతో కట్టిన కట్టడాలు కన్నా వెదురుతో చేసిన కట్టడాల వలన సహజసిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం వలన విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విచ్చేసే పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు పాలకొండ మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పట్టణాభివృద్ధికి అవసరమైన టౌన్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ పరిధిలో ఉండే చెరువులను అభివృద్ధి చేయాలని, చెరువుల చుట్టూ మొక్కలను నాటి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయడం వలన పాదచారులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మునిసిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందరూ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్, విధులు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించిన చార్టులను ప్రజలకు తెలిసేలా ఉంచాలని అన్నారు.ఈ పర్యటనలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్,జిల్లాపర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రమాదేవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగభూషణం, ఏపీఓ చినబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!