

గద్వాల జిల్లా మనధ్యాస సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్య భర్తలు బోయరాముడు, సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తాటికుంట గ్రామానికి చెందిన భార్య భర్తలు నిన్న సాయంత్రం సమయంలో చేపల వేటకు అని రిజర్వాయర్లోకి వెళ్లి రాత్రి అయిన తిరిగి ఇంటికి, పొలం దగ్గరకు రాకపోవడం వాళ్ళు ప్రమాదానికి గురి అయియుండవచ్చు అని గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వం యంత్రాగం వారిని గుర్తించేందుకు పోలీస్, ఫైర్ ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలతో రిజర్వాయర్ లో గాలింపు చేపట్టింది. ఇట్టి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ , ఎమ్మెల్యే రిజర్వాయర్ ను సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీస్, ఫైర్ సిబ్బంది మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, లాస్ట్ ఫోన్ సిగ్నల్ అందిన వివరాలు వారికీ వివరించడం జరిగింది. ఇట్టి విషయంలో మరిన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా గుర్తించాలని తెలియజేస్తూ ఎస్.డి.ఆర్.ఎఫ్ వారికి తగిన సూచనలు చేయడమైనది. రిజర్వాయర్ లో గల్లంతు అయిన సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే స్వయంగా బోటులో ప్రయాణించి పరిశీలించడం జరిగింది. అనంతరం గల్లంతు అయిన దంపతుల పిల్లలను జిల్లా ఎస్పీ , ఎమ్మెల్యే పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. వీరి వెంట డి.ఎస్.పి. వై. మొగిలయ్య, గద్వాల్ సిఐ శ్రీను, ఎస్.డి.ఆర్.ఎఫ్. ఆర్.ఐ. ఎమ్మార్వో జాన్సీ,గట్టు ఎస్సై కే.టీ. మల్లేష్, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, పాల్గొన్నారు.
