

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు సోమవారం వెదురు కుప్పం మండలం మాంబేడు పంచాయతీ ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన మార్గంలోనే రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు అడుగుజాడల్లో నడుస్తున్నామని తెలిపారు.అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు పేదల అభివృద్ధి కోరలేదు ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నామని ఎద్దేవ చేశారు ఎస్ఆర్ పురం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న వల్లెమ్మ మహిళకు నెల రోజుల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేదంటే నావల్ల కాదు అని పక్కకు తప్పుకో నేను నా తమ్ముడు యుగంధర్ మా సొంత నిధులతో వల్లెమ్మ కు ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ నారాయణస్వామి కి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బాబు, ఎంపీడీవో పురుషోత్తం, మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి ,మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, జీడి నెల్లూరు మండల అధ్యక్షుడు స్వామిదాస్, పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణమ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ ,సాఫ్ట్వేర్ బాలు ఎస్ఆర్ పురం, సింగల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు జయరాజ్ నాయకులు మురళి గజేంద్ర అనిల్ బి ఎం రవి ,మండల, అధికారులు పాల్గొన్నారు.
