స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”

మన ధ్యాస, ఐరాల సెప్టెంబర్-01 :- రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల కేంద్రంలోని వి.ఎస్.అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” పాల్గొన్నారు అంతకుముందు ఐరాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు ఎమ్మెల్యే మురళీమోహన్కి పూలమాలలు వేసి దుశ్శాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక ఫింఛన్లు పంపిణీ చేశారు. ‌ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ. “నిత్యవసర సరుకుల పంపిణీలో గతంలో చోటుచేసుకున్న అక్రమాలను అరికట్టే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతికి చెక్ పెడుతూ, న్యాయమైన విధంగా సరుకులు ప్రజలకు చేరేలా చేస్తాయని తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తున్నామని, దీనివల్ల ప్రతి లావాదేవీ రికార్డులోకి వస్తుందని, ప్రజలకు తగిన వాటా అందేలా పర్యవేక్షణ జరుగుతుంది అని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా సాగేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పినా ఆయన, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల సింగల్ విండో ఛైర్మన్ శేషాద్రి నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సుధాకర్ ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

    ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..