సేనతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం..

  • జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:-

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగబోయే జనసేన విస్తృత స్థాయి సమావేశం “సేనతో–సేనాని” కార్యక్రమానికి చారిత్రాత్మక ప్రాధాన్యం లభించింది. ఈ మహాసభ వేదికకు మన్య వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరు ఇవ్వడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కొత్తూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు & విజయవాడ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు గొర్లి నాగేశ్వరరావు వెల్లడించారు.ఈ విషయాన్ని ఆయన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలతో తెలియజేస్తూ మాట్లాడుతూ –“విదేశీ పాలకులపై పోరాడి, స్వాతంత్ర్యాన్ని సాధించడమే కాకుండా గిరిజన ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు. ఇంతటి మహానుభావుని పేరుతో ఏర్పాటైన వేదికపై మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన కొణెదల పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయడం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. ఈ వేదిక నుండి వెలువడే సందేశం రాబోయే రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయనుంది” అని తెలిపారు.అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకుంటూ ఆయన పేర్కొంటూ –“స్వాతంత్ర్య సమరంలో అల్లూరి చూపిన ధైర్యం, త్యాగం, పట్టుదల మనకు నేడు ప్రేరణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, శోషణలను ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడం జనసేన శ్రేణుల ప్రధాన ధ్యేయం కావాలి. అల్లూరి వారసత్వాన్ని కొనసాగించడమే జనసేనకు నిజమైన గౌరవం అవుతుంది” అని చెప్పారు.కొత్తూరు, యూజెపురం ప్రాంతాల జనసేన నాయకులు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ వేదిక నుండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే పిలుపు పార్టీ శ్రేణులకు శక్తినిచ్చి, ప్రజాసమస్యల పరిష్కారానికి దారితీయనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Related Posts

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ…

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకలగ్రామంలో రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం అని రైతులకు వివరించి అధిక యూరియా వలన కలుగు నష్టాలను తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ స్పెషల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 6 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 7 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 6 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు