షిప్‌ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్

Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్‌ను సీజ్ చేశామని చెప్పారు.సీజ్ చేసే చట్టాలు ఉన్నాయని, అంతర్జాతీయ షిప్ అయినా కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న అధికారుల ప్రమేయం ఉందని, అందరిపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో వైసీపీ ప్రభుత్వం బియ్యం మాఫియా చేసిందని అన్నారు. డోర్ డెలివరీ వ్యాన్లతో ప్రజల దగ్గర 10 రూపాయిలకు కొనుగోలు చేసి బియ్యాన్ని సేకరించారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలించారని వివరించారు. కాకినాడ సీ పోర్టుకి అరబిందో ఎలా ప్రవేశించిందని అడిగారు. పోర్టుని పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేశారని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, ఉగ్రవాదుల ముప్పు ఉండదని మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. అంత పెద్ద పోర్టుకి 20 మంది భద్రత పెట్టారని, దీని వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. కాకినాడను స్మగ్లింగ్ కేంద్రంగా మార్చేశారని, మంచి నగరానికి చెడ్డపేరు తీసుకునివచ్చారని తెలిపారు.మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టాకింగ్ పాయింట్స్ లో తనిఖీలు చేస్తున్నానని చెప్పారు. జూన్ 28 తేదీన 13 గోడౌన్స్ సీజ్ చేశామని, 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. 13 కంపెనీలు కోర్టుకి వెళ్తే.. కోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేశామని చెప్పారు.

Related Posts

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.