మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రసూతి గది, స్కానింగ్, ల్యాబ్, డయాలసిసి సెంటర్,జనరల్ వార్డు, డ్రగ్స్ స్టోర్ ను ఆమె పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ల్యాబ్ కు వెళ్లిన కలెక్టర్ అక్కడ రోజుకు ఎన్ని రక్త పరీక్షలు, ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని, టీబీ నిర్ధారణ పరీక్షలు ఎంత మందికి చేస్తున్నారని, టీబీ కోసం సేకరించిన నమూనాలకు ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, చేసిన పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్ లోకి వెళ్ళి ఎన్ని బెడ్స్ ఉన్నాయని, ఎంతమంది డయాలసిస్ చేసుకుంటున్నారనే వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించాలని, మరుగు దొడ్ల తలుపులను మరమ్మతు చేయించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ కు సూచించారు. అనంతరం జనరల్ వార్డుకి వెళ్ళి రోగులతో వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఓపీ విభాగానికి వెళ్లి రోజుకు ఎంత మంది అవుట్ పేషంట్స్ వస్తుంటారని అక్కడి వైద్య సిబ్బందిని ప్రశ్నించగా 200 నుంచి 300 మంది దాకా అవుట్ పేషంట్స్ వస్తుంటారని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఆస్పత్రిలో నమోదు అవుతున్న సీజనల్ వ్యాధుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులేమీ లేవు కదా అని ప్రశ్నించగా ఇప్పటిదాకా వైరల్ ఫీవర్ కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయని సిబ్బంది తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం అన్నారు. చివరగా డ్రగ్స్ స్టోర్ కి వెళ్ళి నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. డ్రగ్స్ కాల పరిమితి ఎలా తెలుస్తుందని డ్రగ్స్ స్టోర్ ఫార్మాసిస్టు ను అడగడంతో డ్రగ్స్ వచ్చినప్పుడు తాము రిజిస్టర్ తో పాటు కంప్యూటర్ లోనూ నమోదు చేస్తామని, మందుల నిల్వ ను బట్టి కాల పరిమితి ముగిసిన వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఫార్మాసిస్టు కలెక్టర్ కు తెలిపారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు