జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పాచిపెంట మండలంలో ఎరువుల షాపుల ఆకస్మిఖ తనిఖీ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 12:- పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో గల ఎరువుల దుకాణాలను పాచిపెంట మండల తహసిల్దార్ డి రవికుమార్,వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం నాడు తహసిల్దార్ రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు పాచిపెంట గురువు నాయుడుపేట గ్రామాలలో గల ఎరువులు దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు.లైసెన్స్ తప్పకుండా షాపుల్లో ప్రదర్శించాలని ఆధీకృత కంపెనీల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేసి మండలంలో ఉన్న రైతులకు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు.బిల్లు బుక్కులు, ఇన్వాయిసులు,రిజిస్టర్లు పక్కగా నిర్వహించాలని సూచించారు.నాణ్యమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని రైతులకు ఎరువులు విక్రయించేటప్పుడు ముఖ్యంగా యూరియా కొనుగోలు చేసే వ్యక్తుల వచ్చేటప్పుడు అధిక యూరియా వాడటం వలన కలిగే నష్టాలను తెలియజేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను కూడా రైతులకు తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా కృష్ణ ఎరువులు డిపో బూర త్రినాధ రావు ఎరువులు డిపో,గురువు నాయుడుపేటలో ఉన్న బంగారమ్మ ఎరువులు డిపో పరిశీలించారు.గ్రామ వ్యవసాయ సహాయకులను ఉద్దేశించి ఎరువులు కొరత ఉన్నది లేనిది తెలుసుకొని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం వరి పంటకు ఎరువులు అవసరం ఉన్నాయని మొక్కజొన్న మరియు పత్తి పంటలకు దాదాపు ఎరువుల విక్రయం పూర్తి చేయబడిందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు