

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ ఏడాది కూడా స్వామి వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవాలయ కమిటీ నిర్ణయించిందని,కొన్ని తరాలుగా జరుగుతున్న ఉత్సవాల్లో పద్మశాలి కుల భాంధవులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొనాలని, స్వామి వారి ఆశీస్సులు పొందాలని అన్నారు.పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుభాష్ రోడ్ లో గల మార్కండేయ ఆలయం లో నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమం తో పాటు స్వామి వారీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా తేదీ 8 శుక్రవారం రోజు రాత్రి గం,, 9:30 ని,,లకు భజన కార్యక్రమం తో మొదలు పెట్టి అదే రోజు రాత్రి జాగరణ కార్యక్రమం జరుపబడును. తేదీ 9 శనివారం నాడు ఉదయం 9 గంటలకు హోమం మరియు హోమం అనంతరం యజ్ఞోపదారిని(జంజం ధారణ) ,సాయంత్రం 4 గంటలకు స్వామి వారి పల్లకి సేవ ఊరేగింపు దేవాలయం నుండి బయలుదేరి చౌక్ బజార్ మీదుగా శ్రీ అనంతశయన దేవాలయం వరకు వెళ్లి దర్శనం గావించి తదుపరి అదే దారి గుండా మార్కండేయ దేవాలయం చేరుకుని మహా మంగళ హారతి తో కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. కావున భక్తులు మరియు హిందూ బంధువులు,కుల భాంధవులు మహిళలలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కొరారు.కార్యక్రమ దృష్ట్యా విజయమంతంగుటకు ప్రతి సభ్యుడు తమ వార్షిక చందాను సహాయ సహకారాలకు అందించాలని సూచించారు. ముఖ్య గమనిక పత్రిక మరియు మీడియా ప్రతినిధులకు మా విన్నపం, దేవాలయ కార్యక్రమాలు ప్రచురించి తమ వంతు కృషి గా దేవాలయ అభివృద్ధికి తమరి సేవలు అందిస్తారని ఆశిస్తున్నమన అన్నారు.ఆహ్వానించు వారు కమిటీ సభ్యులు ,అధ్యక్షులు డా,,క్యాతన్ రఘునాథ్, ప్రధాన కార్యదర్శి క్యాతన్ తిలక్, ఉపాధ్యక్షులు సంబరి శ్రీను,తాటి కృష్ణ,కార్యవర్గ సభ్యులు నీలి శ్రీనివాస్,కర్లీ రాజశేఖర్.