అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2025 – 26 మొదటి విడత ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డా.కలికిరి మురళీమోహన్

యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… రైతులకు అండగా నిలబడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని, రైతుల కష్టం తీర్చేందుకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే ధ్యేయంగా ఏడాదికి రైతులకు ఇచ్చే రూ.20 వేలులో మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. పూతలపట్టు నియోజకవర్గానికి మొత్తం రూ.23.01 కోట్లు నిధులు మంజూరు కాగా, అందులో అన్నదాత సుఖీభవ ₹16.94 కోట్లుగా, పిఎం కిసాన్ యోజనకు రూ.6.07 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. ఐరాల మండలంలో రూ. 4.36 కోట్లు, యాదమరి మండలంలో రూ.4.01 కోట్లు, బంగారుపాలెం మండలంకు రూ. 6.13 కోట్లు, పూతలపట్టు మండలంకు రూ.4.14 కోట్లు, తవనంపల్లి మండలం రూ.4.38 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, యాదమరి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రబ్బీ, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, సింగల్ విండో ఛైర్మన్ చిత్ర నాయుడు, సింగల్ విండో డైరెక్టర్స్ మహబూబ్ బాష, ప్రభాకర్, ఏఎంసీ డైరెక్టర్స్ మోహన్, హరి ప్రసాద్(సతీష్), నాయకులు అమరనాథ్ నాయుడు, హేమయ్య, విజయేంద్ర యాదవ్, జి.యస్.కుమార్, ధరణీ, గోపి గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///