గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రాల ఇస్సాక్ రాజ భూషణం ఆర్థిక సహకారంతో, ఫ్రెండ్స్ స్వచ్చంద సంస్థ మరియు హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “గత 13 ఏళ్లుగా ఇస్సాక్ రాజ భూషణం గారు సింగరాయకొండ పరిధిలో గిరిజన విద్యార్థులకు అనేక విధాలుగా విద్యా సహాయం అందిస్తున్నారు. కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యాన్ని సామాజిక బాధ్యతగా భావించి, అవసరమైన చిన్నారులకు అవసరమైన ఉపకరణాలు, ఆహార పదార్థాలు అందించడం గొప్ప విషయమని” ప్రశంసించారు.అలాగే, “అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, అవి గిరిజన ప్రాంత ప్రజలకు పూర్తిగా అందటం లేదని, కనీస అవగాహనలేమి కారణంగా వారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. సింగరాయకొండ పరిధిలోని కొన్ని గిరిజన కాలనీల్లో విద్యార్థులు 10వ తరగతి కూడా పూర్తి చేయలేకపోతున్నారు. వలసల జీవనశైలి చిన్నారుల చదువుకు అడ్డంకిగా మారుతోంది” అని తెలిపారు.చిన్నారులు మధ్యలోనే బడిని మానేస్తున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి గ్రామాల్లో విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని కత్తి మాధురి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు