కొసలు తుంచి వరుసలలో వరి నాట్లు వేసుకోవాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 31:- పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట మండలంలో వరి నాట్లు వేసే ముందు కొసలు తుంచి నాటడం వలన ఆకు చివర పసుపు రంగు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మూల వలస గ్రామంలో ఆశ్ర పర్యవేక్షకులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో వరుసలలో వరి నాట్లపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పసుపు రంగు కాండం తొలుచు పురుగు వరి ఆకుల చివర గుడ్లను పెడుతుందని నాట్లు వేసే ముందు చివర్లను తుంచి నాటుకుంటే ఈ పురుగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చని తెలిపారు అంతేకాకుండా వరుసలలో వరి నాటుకోవడం వలన వరుసల మధ్య గాలి వెలుతురు బాగా సోకుతుందని దీనివలన చీడపీడల ఉధృతి బాగా తగ్గుతుందని సస్యరక్షణ చర్యలు సులువుగా చేపట్టవచ్చని తెలిపారు గట్లపై కూరగాయలు కంది విత్తనాలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు గిరిజనులు సాధారణంగా తినడం కోసమే వరి పండిస్తారు కాబట్టి ఎలాంటి ఎరువులు మరియు పురుగుమందులు వాడకుండా పండించుకోవాలని అవసరమైతే ప్రకృతి వ్యవసాయం విధానాల కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు చక్రవర్తిని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ