కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న కోవి బసవేశ్వర రావు నాగలక్ష్మి, కోవి రవి శంకర్ చౌదరి మాధవి దంపతులు..!వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, 10 కోట్ల రూపాయలతో, కళ్యాణ మండపం నిర్మాణం..!

వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, దివంగత కోవి సుబ్బారావు, సామ్రాజ్యం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కోవి బసవేశ్వర రావు, నాగలక్ష్మి, కోవి రవిశంకర్ మాధవి దంపతులచే 10 కోట్ల రూపాయలతో నిర్మించిన, కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఊటుకూరుకు గ్రామానికి చెందిన వీరు గత 30 సంవత్సరాల క్రితం, వలస వెళ్లారు. అనేక కష్టనష్టాలను ఎదుర్కొని, స్థిర పడ్డారు. తల్లిదండ్రుల పై ఉన్న ప్రేమతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు, ఆ గ్రామంలోనే 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, విశాలంగా, విలాసవంతంగా, అత్యంత సుందరంగా, జిల్లా స్థాయిలో ఉండే కళ్యాణమండపాలకు పోటీపడే విధంగా తీర్చిదిద్ది, కళ్యాణ మండపాన్ని నిర్మించారు. కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం లో బుధవారం రాత్రి పాలు పొంగించగా, గురువారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కళ్యాణ మండపానికి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ కార్యక్రమానికి చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాదినేని నరేంద్ర, గోరంట్ల మాల్యాద్రి, అంచూరి శ్రీనివాసులు, మందాడి కొండయ్య, మాదినేని నాగార్జున, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…