వాహనాలను తనిఖీ చేస్తున్న పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్

మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి ఒడిస్సా రాకపోకలు సాగిస్తున్న బస్సులు, కార్లు,లారీలు ద్విచక్ర వాహనాలను పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈనెల 28వ తేది నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భద్రతా దుృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు పాచిపెంట పరిధిలో నాకాబంది, వాహనాల తనిఖీలు చేయడం జరుగుతుందని ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 50 వేల రూపాయలు జరిమానా :- బుధవారం నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఐదు మందిపై కేసు నమోదు చేసి సాలూరు కోర్టుకి తరలించామని ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. జడ్జి ఒక్కొక్కరికి 10000 రూపాయలు చొప్పున జరిమానా విధించారని తెలిపారు. మరలా త్రాగి వాహనం నడిపి దొరికిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష వేస్తామని ఆమె హెచ్చరించారు. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..