బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బట్టే చాణుక్య ప్రతాప్, బూత్ కన్వీనర్ చిరంజీవి నాయుడు, సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు మనోహర్ నాయుడు, మురళి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు హనుమంత రెడ్డిని కలిసారు.పరామర్శ సందర్భంగా వారు ఆయన ఆరోగ్య పరిస్థితి తేలుసుకుంటూ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీలో ఆయన్ను ఓ మంచి మార్గదర్శిగా భావిస్తూ, ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో హనుమంత రెడ్డి చూపిన నిబద్ధత, సమర్పణ ప్రజల్లో మంచి పేరును తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన గురుసాల కిషన్ చంద్ మాట్లాడుతూ, “పార్టీ పట్ల హనుమంత రెడ్డి కలిగిన అభిమానం, సుదీర్ఘమైన అనుభవం ఈ తరానికే , రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది” అన్నారు.ఇక బట్టే చాణుక్య ప్రతాప్ మాట్లాడుతూ, “పార్టీని బలోపేతం చేయడంలో హనుమంత రెడ్డి పాత్ర అపూర్వమైనది. ఆయన మళ్లీ త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమం ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుల మధ్య సానుభూతి, మానవీయ విలువలకు అద్దం పడింది. పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలబడే నేతలు, కార్యకర్తల మధ్య మైత్రీ సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సందర్భం మరొకసారి గుర్తు చేసింది.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///