భారీ జన సందోహం నడుమ జడదేవిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం,,,ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వరికుంటపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

వరికుంటపాడు మండలం జడ దేవి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వరికుంటపాడు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. భారీ జన సందోహం నడుమ ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ను వివరించారు. గత వైసిపి పాలనకు నేటి చంద్రన్న పాలనకు వ్యత్యాసాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత ఇసుక పాలసీ, అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మిగిలిన పథకాలను కూడా అమలు పరుస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తూనే, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కనుక ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు.
గ్రామంలోనికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి మండలం మరియు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. స్థానికులు వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటికి పరిష్కార మార్గాలను చూపారు.
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, చండ్ర వెంకయ్య, క్లస్టర్ ఇంచార్జ్ పోకా మహేష్, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, యూనిట్ ఇంచార్జ్ గుర్రం గోపి, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ ఆవుల అరుణమ్మ, ఆండ్రా బాల గురువారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గొడుగులూరు మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్, పొద మాధవరావు, మూలే వీరారెడ్డి,అరికొండ వెంకటరత్నం, కామేపల్లి శ్రీనివాసులు, సంధిరెడ్డి మాలకొండయ్య, టిడిపి నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కలిగిరి :(మన ద్యాసన్యూస్):ప్రతినిధి, నాగరాజు :/// ఆంధ్రప్రదశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    ఆంధ్రప్రదేశ్ : (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు :///// కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం… ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు