రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న  సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్

మన న్యూస్ ఐరాల జులై-28:-

జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు 2 సంవత్సరాల ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు ఇద్దరు అనాథలయ్యారు. వీరి యొక్క ఆలనా పాలన వారి యొక్క పెదనాన్న, పెద్దమ్మ తీసుకున్నారు. వీరి యొక్క పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి తక్షణ సాయం కింద, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయము, మరియు ఇద్దరు పిల్లలకి నెలకి 4000/- రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒక లక్ష రూపాయలు చెక్కు కూడా మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా ఇద్దరు పిల్లలు యొక్క చదువు కోసం అమర్ రాజా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్లకి ఉచిత విద్యను కూడా అందించడానికి జిల్లా కలెక్టర్ చొరవ చూపారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబునాయుడుకి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చెక్కును అందించడం జరిగింది.
ఈ పిల్లను ఆదుకున్నందుకు ఈ చిన్న పిల్లల పెదనాన్న పెద్దమ్మ మరియు వారి తాత రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///