బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి: బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్

నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నర్వ మండల కేంద్రంలోని బీసీ కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐలయ్య యాదవ్, చెన్నయ్య సాగర్, నీరాజ్, గడ్డం నరసింహ తదితరులు మాట్లాడుతూ, “ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంటుకు పంపింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి” అన్నారు.బీసీలకు ఇప్పటివరకు విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల అనేక నష్టాలు వాటిల్లాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేధావుల లెక్కల ప్రకారం బీసీల జనాభా 42 శాతంగా ఉండటమే ఈ రిజర్వేషన్ తీర్మానానికి ఆధారం అని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా గెలిచి మొదటిసారిగా బీసీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇది బీసీ వర్గానికి ఒక గౌరవంగా భావించాల్సిన సందర్భమని వారు అభిప్రాయపడ్డారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ పార్లమెంటులో బీసీల తరఫున నిలబడి, ఈ 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని కోరారు. ఈ సమావేశంలో యాంకి కురుమూర్తి, శ్రీకాంత్ రెడ్డి వెంకట్రాంరెడ్డి, ఎండి ఫజల్, ఎండి రఫీ, గొల్ల మొయిలప్ప, రామచంద్రి, సతీష్ గౌడ్ తదితర గ్రామాల బీసీ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు..

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///