జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు,  న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది,  జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,

మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం లోబడి తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని. ఈ విషయంలో తోట లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు, బీసీ వర్గానికి చెందిన వాడని తాను ఎన్నిక పిటిషన్ వేయడం జరిగిందని. న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని హనుమాన్ షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడేది ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చి చెప్పారు. ఇటీవల తాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావుతో రాజీ పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని హనుమాన్ షిండే ఖండించారు. తాను 15 ఏళ్ల కాలం పాటు జూకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశానని ఎక్కడైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఉంటే రుజువు చేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటారు అని భార స మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే వెల్లడించారు. తన జీవితం తెల్ల కాగితం లాంటిదని ఎప్పుడు ఎవరైనా తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే తలవంచుతానని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఎక్కడి నుంచో వచ్చి జూకల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంత్రావుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయానికి కష్టపడితే. ప్రస్తుతం వారిపై తిరుగుబాటు చేస్తున్నారని హనుమాన్ సిండే ఆరోపించారు . తోట లక్ష్మీకాంత్ రావు ఏడాది పాలనలో జూకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హనుమాన్ షిండే వెల్లడించారు. విజయానికి కృషి చేసిన వారిపై వారి సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు అంటూ హనుమాన్ షిండే వెల్లడించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వడానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఈ విషయంపై జూకల్ నియోజకవర్గం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే లక్ష్మీకాంతవు కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలని. లక్ష్మీకాంతరావు అవినీతిని అక్రమాలకు కాంగ్రెస్ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని హనుమాన్ షిండే గుర్తు చేశారు. మంచి నాయకున్ని ఓడించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గెలిపించినందుకు జూకల్ నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే పేర్కొన్నారు. ఎప్పటికీ తాను జూకర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని, ఎవరు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలంటూ బారసా నాయకులకు , కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించారు

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..