నరాల సమస్యలపై అందరూ అవగాహన కలిగి ఉండాలి – ప్రముఖ న్యూరాలజిస్ట్ జి. సంఘ మిత్ర

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో గూడూరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల డాక్టర్ సి ఆర్ రెడ్డి భవనము నంద లి అయ్యల చంద్రమ్మ భాస్కరరావు ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ జి సంఘమిత్ర మాట్లాడుతూ నరాల సమస్యలపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 35 సంవత్సరముల పైబడిన వారు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ పి. జగదీష్ మాట్లాడుతూ 60 శాతం మంది డయాబెటిక్తో బాధపడుతున్నారని ఆహార నియమాలు తప్పక పాటించాలని కోరారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన్ సాయి రూప మాట్లాడుతూ ప్రతి ఆడవారు సంవత్సరానికి ఒకసారి అన్ని రకాల టెస్టులు తప్పక చేయించుకోవాలని తెలిపారు. తదుపరి రోగులకు అందరికీ పరీక్షించి, డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అన్ని విభాగాలలో ఉచిత మందులను కిమ్స్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఇవ్వడం జరిగినది. క్యాంప్ చైర్మన్ లయన్ షేక్ .రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి పేదల కోసం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రముఖులు డాక్టర్ చంద్రహాస్, మధురమేటి రమణయ్య, మల్లెమాల మురళి రెడ్డి, బీ. సీనయ్య , సోమిశెట్టి చెంచురామయ్య, రూపేష్ రెడ్డి, ఆర్ రవిచంద్ర, వీరేంద్రనాథ్, అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి, డాక్టర్ సుగుణమ్మ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, రోగులు, హాజరై పరీక్షలు నిర్వహించుకుని ఉచిత మందులను తీసుకోవడం జరిగినది. కిమ్స్ హాస్పిటల్ పి ఆర్ ఓ నవీన్ విజయకుమార్ మాట్లాడుతూ క్యాంపు విజయవంతమైందని 150 మందిని పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..