అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు.-తృటిలోతప్పిన ప్రమాదం

ఉరవకొండ మన న్యూస్: అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామీణ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు అతి కష్టం మీద నెగ్గుకు వస్తున్నారు. తాజాగా
ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం నుండి బయటపడింది.
ఉరవకొండ మీదుగా దర్గా వన్నూర్ బయలుదేరిన బస్సు దర్గా వన్నూరు సమీపంలో త్రుటిలో ప్రమాదం నుండి బయటపడింది. రోడ్డు దగ్గర మురికి నీరు నిల్వ ఉండడంతో గుంతలో పడి బస్సు ఒరిగింది. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.
కాగా ఎస్ టి ఐ రమణమ్మ వాహన పరిస్థితుల స్థితిగతులపై, రహదారి స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమక్షించిన పాపాన పోలేదు. ఆమె కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తోంది. రహదారులపై ఆరా తీసిన పాపాన ఏనాడు పోలేదు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పోలవరం పథకం అమలు చేయాల్సి ఉంది. ఇది నిజమైతే డొక్కు బస్సుల ప్రయాణంతో ప్రయాణికుల అవస్థలు ఎన్నెన్నో పడాల్సి వస్తోంది. ఏదేమైనాప్పటికీ రవాణా వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారి సైతం నిద్ర మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కండిషన్ లేని బస్సుల పట్ల తదుపరి చర్యలు తీసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన అవసరం ఎంతో ఎంతో ఉంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ డిపో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..