సాగు చేస్తున్న భూములు కు పట్టాలివ్వాలి – కొటికి పెంట సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతు లు ఆందోళన

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని పాచిపెంట మండలం కొటికి పెంట పంచాయితీ సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్త పేట ఒలిసలమడ గిరిజన రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం నాడు 40 మంది గిరిజన కుటుంబాల ప్రజలు తాసిల్దారు కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ తాసిల్దారు రవికి వినతి పత్రం అందజేశారు. తన పంచాయతీలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు తాము అధికారులతో పోరాడుతానని, గిరిజనులకు అండగా ఉంటానని సర్పంచ్ అప్పలనాయుడు మద్దతు పలికారు. నాగరికత తెలియని గిరిజన ప్రజలు రెండు దశాబ్దాలుగా ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదని ఆవేదన చెందారు.వీరి బ్రతుకులు ఇంతేనా మారవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2001 సర్వేనెంబర్ లో సాగు చేస్తున్న భూములు అటవీశాఖ అధికారులు తమ వంతు ఆ భూమి మీద నుంచి గిరిజన రైతులను వెళ్ళగొడుతున్నారని వెంటనే సంబంధిత తాసిల్దారు స్పందించి సర్వే నిర్వహించి అమాయక గిరిజనులకు న్యాయం జరిగే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని సర్పంచ్ అప్పలనాయుడు కోరుతున్నారు. సాగు చేస్తున్న భూములకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు రాకపోవడంతో కనీస అవసరాలు తీరక కపోవడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి చెందక దయనందిక జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి స్పందించి రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఒలిసలమడ, కొత్తపేట గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా